ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణ పోలీసుల చేత నగర బహిష్కరణ వేటు పొందిన కత్తి మహేశ్ ను అతని తండ్రి ఓబులేసు సమర్థించాడు. తన కొడుకు ఎవిడెన్స్ ఉన్నందునే అలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పారు. అంతేకానీ అతని వ్యాఖ్యలకు మనోభావాలు దెబ్బతిన్నాయనడం సరికాదన్నారు. దళితుడు కావడం చేతనే తన కొడుకుపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల శ్రీరాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, అవి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, హిందూమతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రాముడి గురించి తన కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమేనని చెప్పడం గమనార్హం.
No comments:
Post a Comment