ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశం ఉంది. మాజీ మంత్రి సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నుంచి తప్పుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరితో చర్చలు జరిగాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు, ఆయన రావడానికి ముందుగానే రామనారాయణ అక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పుకున్నారని చెబుతున్నారు. అంతేకాకా తాజాగా నెల్లూరులోని తన ఆఫీస్ నుంచి చంద్రబాబు పోటో కూడా తొలగించారని వార్తలు వస్తున్నాయి. దీంతో రామనారాయణ రెడ్డి పార్టీని వీడడం ఖాయమని అంటున్నారు. ఆయన వెంకటగిరి సీటు కావాలని అడుగుతున్నారని ఆ వార్తలు సూచిస్తున్నాయి. గత ఏడాది టీడీపీలో చేరిన తర్వాత ఆనం సోదరులకు అవమానాలు ఎదురయ్యాయనే అంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ మారుతున్నారన్న వార్తలు రావడంతో ఆయనను బుజ్జగించడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని, అయినా అందుకు రామనారాయణ సుముఖంగా లేరని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశం ఉంది. మాజీ మంత్రి సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నుంచి తప్పుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరితో చర్చలు జరిగాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆనం వివేకానందరెడ్డిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు, ఆయన రావడానికి ముందుగానే రామనారాయణ అక్కడ నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పుకున్నారని చెబుతున్నారు. అంతేకాకా తాజాగా నెల్లూరులోని తన ఆఫీస్ నుంచి చంద్రబాబు పోటో కూడా తొలగించారని వార్తలు వస్తున్నాయి. దీంతో రామనారాయణ రెడ్డి పార్టీని వీడడం ఖాయమని అంటున్నారు. ఆయన వెంకటగిరి సీటు కావాలని అడుగుతున్నారని ఆ వార్తలు సూచిస్తున్నాయి. గత ఏడాది టీడీపీలో చేరిన తర్వాత ఆనం సోదరులకు అవమానాలు ఎదురయ్యాయనే అంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ మారుతున్నారన్న వార్తలు రావడంతో ఆయనను బుజ్జగించడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని, అయినా అందుకు రామనారాయణ సుముఖంగా లేరని అంటున్నారు.
No comments:
Post a Comment