టీవీ చానళ్లలో హోదాపై చర్చ జరుగుతున్న సందర్భంలో కొందరు దాడులకు పాల్పడడం సరికాదని ప్రముఖ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని ఆయన అన్నారు. ఇది నియంతృత్వం కాదని ఆయన అన్నారు. ఒక్కోసారి ఇబ్బంది అయినా వినడం ప్రజాస్వామ్య లక్షణం అని ఆయన అన్నారు. దాడులు చేస్తే మరింత బలహీనపడతారు తప్ప బలపడరు. ప్రజలు సంపూర్ణంగా, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకొనే విధంగా వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నానని ఆయన అన్నారు.
Post Top Ad
Saturday, February 24, 2018
అభిప్రాయాలు తెలిపే హక్కు అందరిదీ:పవన్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment