మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన బంద్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన బంద్

no-movie-shows-from-march2nd
డిజిటల్ వ్యవస్థలో సినిమాలు ప్రదర్శించడం విషయంలో క్యూబ్, యుఎఫ్ఓ సంస్థలతో సిని నిర్మాతలు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దాంతో మార్చి రెండు నుంచి దక్షిణాది రాష్ట్రాలలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్మాతలు, పంపిణీదారుల సంఘాలు నిర్ణయించాయి. బెంగుళూరులో ఫిలిం చాంబర్ లో ఈ రాష్ట్రాల నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. సినిమాల ప్రదర్శనకు క్యూబ్‌, యూఎఫ్‌వో అధిక ధరలు వసూలు చేస్తున్నాయనే అంశంపై ఈ భేటీలో చర్చించారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు వసూలు చేస్తున్న ధరలు తగ్గించాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. క్యూబ్‌, యూఎఫ్‌వోయుఎఫ్ ప్రతినిధులు ఇందుకు ఒప్పుకోలేదు. ఆ మీదట మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad