రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఊసరవెల్లి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆయనకు ఎప్పుడు ఎలాంటి మోసాలు చేయాలో బాగా తెలుసని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో లాభం లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హోదా నాటకం ఆ
డుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాను పొందిన రాష్ట్రాలు నష్టపోయాయని, ప్యాకేజీనే అద్భుతం అంటూ చంద్రబాబు గతంలో ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రత్యేక హోదాను బతికించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యమాలు చేశారని తెలిపారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో చంద్రబాబు మరోనాటకానికి తెరలేపుతున్నారని, ఇప్పుడు ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కసారైన ప్రత్యేక హోదా కావాలన్నారా అని ప్రశ్నించారు. గతంలో డ్రామాలు ఆడిన చంద్రబాబుకు ఏగతి పట్టిందో ఇప్పుడు నాటకాలాడుతున్న బీజేపీ, టీడీపీకి అదే గతి పడుతుందని అంబటి హెచ్చరించారు.
డుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదాను పొందిన రాష్ట్రాలు నష్టపోయాయని, ప్యాకేజీనే అద్భుతం అంటూ చంద్రబాబు గతంలో ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రత్యేక హోదాను బతికించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యమాలు చేశారని తెలిపారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో చంద్రబాబు మరోనాటకానికి తెరలేపుతున్నారని, ఇప్పుడు ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్కసారైన ప్రత్యేక హోదా కావాలన్నారా అని ప్రశ్నించారు. గతంలో డ్రామాలు ఆడిన చంద్రబాబుకు ఏగతి పట్టిందో ఇప్పుడు నాటకాలాడుతున్న బీజేపీ, టీడీపీకి అదే గతి పడుతుందని అంబటి హెచ్చరించారు.
No comments:
Post a Comment