తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీకి మకాం మార్చనుడటం ఖాయమైంది. ఢిల్లీలో చంద్రబాబుకు కేటాయించిన నివాసంలో లోకేష్ బాబుకు ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. పార్టీని జాతీయ స్థాయిలో బలపరిచేందుకు లోకేష్ ఢిల్లీ చేరుకొంటున్నాడని అంటున్నారు కానీ.. పార్టీ కోసం కాదు, జాతీయ స్థాయిలో తన గుర్తింపును పెంచుకునేందుకు లోకేష్ అక్కడకు వెళుతుండవచ్చు.. అనేది రాజకీయ విశ్లేషకుల మాట.
అయితే.. ఢిల్లీలో లోకేష్ కు ఏ మాత్రం గుర్తింపు దక్కుతుంది? అనేది ప్రశ్నార్థకం! ఎందుకంటే.. కనీసం ఆయన ఎంపీ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అనే గుర్తింపు మాట ఎలా ఉన్నా.. చంద్రబాబు తనయుడిగానే లోకేష్ కు గుర్తింపు ఉంటుంది. వెనుకటికి చాలామంది రాజకీయ వారసులు ఢిల్లీ వైపు వెళ్లినా.. అందరూ ఎంపీ హోదాలతోనే వెళ్లారు! వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ కడప నుంచి ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లాడు. అలాగే ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ తో సహా అనేకమంది రాజకీయ వారసులు.. ఎంపీలుగా ఢిల్లీలో మకాం పెట్టి ఆపై రాజకీయంగా గుర్తింపు సంపాదించారు.
అయితే లోకేష్ మాత్రం అలాంటి హోదా ఏమీ లేకుండానే అక్కడకు వెళితే.. ఇతర రాజకీయ వర్గాల వారితో మమేకం కావడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందనేది ప్రశ్నార్థకం! ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. లోకేష్ బాబు ఇప్పటి వరకూ ఏపీ లెవల్లో పార్టీ క్యాడర్ తో మమేకం అయ్యాడు. చంద్రబాబు కు పార్టీ క్యాడర్ తో కలిసి మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, అందరినీ కలుపుకునే సమయం ఎలాగూ లేదు. ఆ లోటును లోకేష్ భర్తీ చేస్తూ వచ్చాడు.మరిఇప్పుడు ఈయన కూడా ఢిల్లీ వెళ్లిపోతే.. తెలుగుదేశం క్యాడర్ ను కలుపుకుపోయే వాళ్లు ఎవరూ లేకుండా పోతారు! ఈ విషయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆలోచించుకోవాల్సిన అంశమే! మరి కొన్ని రోజులు పోతే కానీ.. లోకేష్ ఢిల్లీ చేరిక ప్లస్సో మైనస్సో తెలీదు!
అయితే.. ఢిల్లీలో లోకేష్ కు ఏ మాత్రం గుర్తింపు దక్కుతుంది? అనేది ప్రశ్నార్థకం! ఎందుకంటే.. కనీసం ఆయన ఎంపీ కూడా కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అనే గుర్తింపు మాట ఎలా ఉన్నా.. చంద్రబాబు తనయుడిగానే లోకేష్ కు గుర్తింపు ఉంటుంది. వెనుకటికి చాలామంది రాజకీయ వారసులు ఢిల్లీ వైపు వెళ్లినా.. అందరూ ఎంపీ హోదాలతోనే వెళ్లారు! వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ కడప నుంచి ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్లాడు. అలాగే ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ తో సహా అనేకమంది రాజకీయ వారసులు.. ఎంపీలుగా ఢిల్లీలో మకాం పెట్టి ఆపై రాజకీయంగా గుర్తింపు సంపాదించారు.
అయితే లోకేష్ మాత్రం అలాంటి హోదా ఏమీ లేకుండానే అక్కడకు వెళితే.. ఇతర రాజకీయ వర్గాల వారితో మమేకం కావడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందనేది ప్రశ్నార్థకం! ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. లోకేష్ బాబు ఇప్పటి వరకూ ఏపీ లెవల్లో పార్టీ క్యాడర్ తో మమేకం అయ్యాడు. చంద్రబాబు కు పార్టీ క్యాడర్ తో కలిసి మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, అందరినీ కలుపుకునే సమయం ఎలాగూ లేదు. ఆ లోటును లోకేష్ భర్తీ చేస్తూ వచ్చాడు.మరిఇప్పుడు ఈయన కూడా ఢిల్లీ వెళ్లిపోతే.. తెలుగుదేశం క్యాడర్ ను కలుపుకుపోయే వాళ్లు ఎవరూ లేకుండా పోతారు! ఈ విషయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆలోచించుకోవాల్సిన అంశమే! మరి కొన్ని రోజులు పోతే కానీ.. లోకేష్ ఢిల్లీ చేరిక ప్లస్సో మైనస్సో తెలీదు!
No comments:
Post a Comment