దివంగత నేత పీవీ నరసింహారావుకు నాయకుల నివాళులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, June 28, 2015

దివంగత నేత పీవీ నరసింహారావుకు నాయకుల నివాళులు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు మంత్రులు మహమూద్ అలీ, నాయిని నరసింహారావు, హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, జానారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. పీవీ ఘాట్ వద్దకు నేతలు ఉదయం నుంచి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. పీవీ సేవలను కాంగ్రెస్‌ మరిచిపోదన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి పీవీ అని జానారెడ్డి తెలిపారు. పీవీ ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి, దేశాన్ని ప్రగతి పథంలో నడిపారని జానారెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తిగా పీవీని నాయిని అభివర్ణించారు. 









No comments:

Post a Comment

Post Bottom Ad