ఈ మధ్య కాలంలో సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఓ పాటనో లేక ఓ ఫైట్ నో జత చేయటం కామన్ గా మారిపోయింది. తాజాగా ఆ జాబితాలో రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా చేరింది. ఆ సినిమాలో మరో పాటను జత చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం విడుదలయిన విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ఈ పాట చిత్రీకరణ కోసం దసరా పండుగ రోజు కూడా పని చేస్తున్నాడు. పాట పూర్తయ్యేవరకూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని డిసైడ్ అయినట్లు రామ్ చరణ్ తెలిపాడు. ముందుగా ఈ సినిమా ప్రీమియర్ షో కోసం యూఎస్ వెళ్లాలనుకున్నా సమయం లేకపోవటంతో వెళ్లలేకపోయినట్లు చెర్రీ పేర్కొన్నాడు. ఈ దసరాను సెట్ లోనే జరుపుకుంటున్నట్లు రామ్ చరణ్ వెల్లడించాడు. రామ్ చరణ్ కు జంటగా కాజల్ నటించింది. శ్రీకాంత్, కమలినీ మరో జంటగా తెరపై సందడి చేయగా, సీనియర్ నటుడు రామ్ చరణ్ కు తాతయ్య పాత్రలో కనిపించాడు. మరి కొత్తగా జత చేయబోయే పాట సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment