వెట్టిచాకిరి నుంచి బాలలను విముక్తి చేయటానికి పాటుపడుతున్న మనదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి, బాలికల విద్య కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడుతున్న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్లను ఈ ఏడాది నోబెల్ శాంతిబహుమతి వరించింది. చిన్నారుల విద్య కోసం ఉద్యమిస్తూ.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ ఒక హిందూ-ఒక ముస్లిం, ఒక భారతీయుడు-ఒక పాకిస్థానీ ఉమ్మడి పోరాటంతో మమేకం కావటాన్ని ముఖ్యమైన పరిణామంగా పరిగణిస్తున్నామని నోబెల్ బహుమతిని అందించే 'నార్వే నోబెల్ కమిటీ' పేర్కొంది. చిన్నారులు, యువతపై అణిచివేతకు వ్యతిరేకంగా, బాలల విద్యాహక్కులకు అనుకూలంగా వీరిద్దరూ ఉద్యమించారని.. దీనికి గుర్తింపుగానే వీరిని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశామని శుక్రవారం తెలిపింది. వీరిద్దరికీ కలిపి డిసెంబరులో 11 లక్షల డాలర్ల (దాదాపు రూ.6.7 కోట్లు) మొత్తాన్ని అందజేయనుంది.
వెట్టిచాకిరి నుంచి బాలలను విముక్తి చేయటానికి పాటుపడుతున్న మనదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి, బాలికల విద్య కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడుతున్న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్లను ఈ ఏడాది నోబెల్ శాంతిబహుమతి వరించింది. చిన్నారుల విద్య కోసం ఉద్యమిస్తూ.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ ఒక హిందూ-ఒక ముస్లిం, ఒక భారతీయుడు-ఒక పాకిస్థానీ ఉమ్మడి పోరాటంతో మమేకం కావటాన్ని ముఖ్యమైన పరిణామంగా పరిగణిస్తున్నామని నోబెల్ బహుమతిని అందించే 'నార్వే నోబెల్ కమిటీ' పేర్కొంది. చిన్నారులు, యువతపై అణిచివేతకు వ్యతిరేకంగా, బాలల విద్యాహక్కులకు అనుకూలంగా వీరిద్దరూ ఉద్యమించారని.. దీనికి గుర్తింపుగానే వీరిని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశామని శుక్రవారం తెలిపింది. వీరిద్దరికీ కలిపి డిసెంబరులో 11 లక్షల డాలర్ల (దాదాపు రూ.6.7 కోట్లు) మొత్తాన్ని అందజేయనుంది.
No comments:
Post a Comment