ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీకాం సప్లమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. ప్రతాప్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి జరగాల్సిన పరీక్షలు వివిధ కారణాల వల్ల వాయిదా వేసినట్లు చెప్పారు. తదుపరి పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఇంగ్లీష్-సీబీటీ సప్లమెంటరీ పరీక్ష కూడా..
ఓయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల ఇంగ్లీష్-సీబీటీ సప్లమెంటరీ పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను తిరిగి వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా కేంద్రం, సమయంలో ఎటువంటి మార్పు లేదని వివరించారు. వివరాలకు www. osmania.ac.in లో చూసుకోవచ్చన్నారు.
ఇంగ్లీష్-సీబీటీ సప్లమెంటరీ పరీక్ష కూడా..
ఓయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల ఇంగ్లీష్-సీబీటీ సప్లమెంటరీ పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను తిరిగి వచ్చే నెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా కేంద్రం, సమయంలో ఎటువంటి మార్పు లేదని వివరించారు. వివరాలకు www. osmania.ac.in లో చూసుకోవచ్చన్నారు.
No comments:
Post a Comment