వివాదంలో 'మిత్రవింద' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 25, 2014

వివాదంలో 'మిత్రవింద'

kajal-agarawal-remunaration-issue
వివాదాల్లో హీరోయిన్లు అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. మొదట నటించడానికి సమ్మతించడం.. అడ్వాన్స్ లు తీసుకోవడం.. ఆ తరువాత కాల్‌షీట్స్ లేవంటూ నిర్మాతల్ని సమస్యల్లోకి నెట్టడంలాంటి పనులతో కొంతమంది హీరోయిన్లు తప్పులు చేస్తున్నారు. అయితే హీరోయిన్ల వెర్షన్ వేరేలా ఉంది. తామిచ్చిన కాల్‌షీట్స్ సద్వినియోగ పరుచుకోకుండా ఇతర చిత్రాల్లో నటించనీయకుండా కొందరు నిర్మాతలు తమను నష్టపరుస్తున్నారన్నది నాయికల వాదన. ప్రస్తుతం ఇలాంటి వివాదాల్లోనే నటి కాజల్ అగర్వాల్ చిక్కుకున్నారు. వీరిద్దరిపై నిర్మాతల మండలికి ఫిర్యాదులు చేరాయి. వివరాల్లోకెళితే నటి కాజల్ అగర్వాల్ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సరసన 'నన్బేండా' చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అందుకు పారితోషికం కోటిన్నరగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అదేవిధంగా అడ్వాన్స్‌గా 40 లక్షలు పుచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద నన్బేండా చిత్రంలో కాజల్ నటించలేదు. ఆమెకు బదులు నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో తానిచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయాల్సిందిగా ఉదయనిధి స్టాలిన్ కాజల్ అగర్వాల్‌ను అడిగారు. అందుకామె అడ్వాన్స్ తిరిగిచ్చేది లేదు పొమ్మంది. అందుకామె చెబుతున్న రీజన్ తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను సద్వినియోగం చేసుకోకుండా చివరి క్షణంలో షూటింగ్ షెడ్యూల్ మార్చుకోవడం వల్ల తన కాల్‌షీట్స్ వృథా అయ్యాయని, తద్వారా తెలుగులో ఒక ప్రముఖ నటుడితో నటించే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందన్నది. దీంతో ఉదయనిధి స్టాలిన్ కాజల్‌పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad