తొలి స్వర్ణం దక్కించుకున్న భారత్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, September 20, 2014

తొలి స్వర్ణం దక్కించుకున్న భారత్

jitirai-indianshooter-wins-goldmedal
ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం చేసింది.  దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్ లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad