తెలుగు సినిమాలపై ఐటీ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది దసరా పండుగకు పెద్ద హీరోల సినిమాలు తెలుగునాట విడుదల కావడం తెలిసిందే. ఈ క్రమంలో యంగ్ హీరోల సినిమాలకు కోట్లలో నిర్మాతలు ఖర్చు చేయడంతో ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. ‘ఆగడు’ ప్రొడక్షన్ హౌస్పై ఐటీ అధికారులు దృష్టిపెట్టినట్టు సమాచారం. రెండురోజుల కిందట అకౌంట్ డిపార్ట్మెంట్కి చెందిన కొందరు అధికారులు.. ఈ కార్యాలయానికి ఫోన్ చేసి రిలీజ్కి టికెట్లు కావాలని రిక్వెస్ట్ చేసినట్లు టాక్. అధికారులు టికెట్లు కోరిన నేపథ్యంలో దీని వెనుక ఏమైనా మతలబు వుందా అని ఇండస్ర్టీలో మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్పై ఐటీ అధికారులు దృష్టి పెట్టడం ఇదేం కొత్తకాదు. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాల రిలీజ్కు ముందు అధికారులు దాడులు చేసిన సందర్భాలున్నాయి. గతంలో దిల్రాజు, బండ్లగణేష్, 14 రీల్స్ బ్యానర్ సంస్థ
ఆఫీసులలో సోదాలు చేసిన విషయం తెల్సిందే!
ఆఫీసులలో సోదాలు చేసిన విషయం తెల్సిందే!
No comments:
Post a Comment