హైదరాబాద్ :
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తెలంగాణపైనా ప్రభావం చూపిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి. ఆయన అక్కడ అధికారంలోకి రావడంతో ఇక్కడ వర్షాలు పడడంలేదని ప్రజలు అనుకుంటున్నారని నాయిని పేర్కొన్నారు. నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుతో జత కలిసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారని నాయిని ఆరోపించారు. తాము చేపడుతున్న పథకాలు చూసి ఓర్వలేని టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ కార్యక్రమంలో మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తెలంగాణపైనా ప్రభావం చూపిందంటున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి. ఆయన అక్కడ అధికారంలోకి రావడంతో ఇక్కడ వర్షాలు పడడంలేదని ప్రజలు అనుకుంటున్నారని నాయిని పేర్కొన్నారు. నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాయిని ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుతో జత కలిసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలంగాణకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారని నాయిని ఆరోపించారు. తాము చేపడుతున్న పథకాలు చూసి ఓర్వలేని టీడీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ కార్యక్రమంలో మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
No comments:
Post a Comment