ఏపీ డీజీపీకి అరకు ఎంపీ గీత ఫిర్యాదు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, August 04, 2014

ఏపీ డీజీపీకి అరకు ఎంపీ గీత ఫిర్యాదు


హైదరాబాద్
: తన ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేశారంటూ అరకు వైసీపీ ఎంపీ కొత్తపల్లి గీత ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడుకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి అసభ్యకర కామెంట్లు రాసారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖ జిల్లా ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు పంపారు. కేసును సిటీ సైబర్ క్రైం పోలీసులకు బదిలీ చేసినట్లు విశాఖ రూరల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కొత్తపల్లి గీత వైసీపీని వీడుతున్నట్లు ప్రచారం మొదలైనప్పటి నుంచి కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా దాడికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన పోస్టింగులు ప్రారంభమైనట్లు సమాచారం.

No comments:

Post a Comment

Post Bottom Ad