హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ‘మా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రభాకర్రెడ్డి 2009 నుంచి పార్టీలో ఉన్నారు. మరి జగ్గారెడ్డి ఎప్పటినుంచి బీజేపీలో ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న జగ్గారెడ్డికి మీరు టికెట్ అమ్ముకున్నారని అనుకోవచ్చా?’ అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని అంటున్నారని ప్రశ్నించగా, పవన్ని ఇప్పటికే ప్రజలు బండకేసి కొట్టారన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం దాల్చిన సందర్భంలో కాంగ్రెస్ విప్ గా ఉన్న జగ్గారెడ్డి నేను ముమ్మాటికి సమైక్యవాదినే... తెలంగాణ రావడం ఏమాత్రం ఇష్టంలేదని చెప్పిన జగ్గారెడ్డి తెలంగాణ వ్యతిరేకి... అయినా ఈ విషయం అందరికి తెలుసు.. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన జగ్గారెడ్డి.. తన రాజకీయ భవిష్యత్ కోసమే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ...పార్టీ టికెట్ ఇవ్వరని గ్రహించిన జగ్గారెడ్డి.. బీజేపీలో చేరారని.. అయితే సమైక్య వాదిగా తెలంగాణలో ముద్రపడ్డ జగ్గారెడ్డి.కి మెదక్ ఎంపి టికెట్ ను బీజేపీ ఎలా కేటాయించిందని ఎంపీ కవిత పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. సమైక్యవాదిగా ముద్ర పడ్డ జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగానే తెలంగాణ ప్రజలు ఓడించారని.. అయితే ఏమొహం పెట్టుకొని మళ్లీ ఎంపిగా ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని అడుగుతారని అన్నారు. మా పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీ సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ - టీడీపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారానికి నటుడు పవన్ కళ్యాణ్ వస్తే ప్రజలు సహించే స్థితిలో లేరని ఒక ప్రశ్నకు ఆమె సమాదానమిచ్చారు.
Post Top Ad
Friday, August 29, 2014
సమైక్య వాదికి తెలంగాణలో టికెట్ ఎలా ఇచ్చారు: కవిత
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment