ఫేస్ బుక్ పేజీ అదృశ్యం అయిపోయింది - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, August 01, 2014

ఫేస్ బుక్ పేజీ అదృశ్యం అయిపోయింది



హైదరాబాద్ : ఫేస్ బుక్ లో సమస్య తలెత్తింది. రాత్రి 9.30 గంటల తర్వాత ఉన్నట్టుండి ఫేస్ బుక్ పేజీ మొత్తం అదృశ్యం అయిపోయింది. ఏదో తెలియని ఇబ్బంది ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించడానికి తాము కృషి చేస్తున్నామంటూ ఓ సందేశం మాత్రం కనిపించింది. మధ్యలో కాసేపు బాగానే ఉన్నా.. మళ్లీ తర్వాత అదే సమస్య తలెత్తింది. దాంతో యూజర్లు ఒక్కసారిగా హతాశులయ్యారు.ఈ సమస్య ఎందుకు వచ్చిందో, ఎంతసేపు ఉంటుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఫేస్ బుక్ కూడా సమస్య ఎక్కడినుంచి వచ్చిందో తెలియకపోవడంతో అంతకుమించి మరేమీ చెప్పలేకపోయింది. వచ్చి.. పోయి.. వచ్చి.. పోయి.. అన్నట్లుండి, యూజర్ల సహనానికి పరీక్ష పెట్టింది.

No comments:

Post a Comment

Post Bottom Ad