నెల్లూరు: నెల్లూరులో శనివారం సాయంత్రం ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబునాయుడు ప్రారంభించడానికి వచ్చాడు.అక్కడి ప్రజలు డ్వాక్రా రుణాలను ఎప్పుడు రద్దు చేస్తారని తెలుగింటి ఆడపడుచులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నిలదీశారు. ముఖ్యమంత్రిగా తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతుండగా డ్వాక్రా మహిళలు అడ్డుకుని, రుణాలను ఎప్పుడు రద్దుచేస్తారని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సమాధానం దాటవేశారు. , ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని మహిళలు నిలదీశారు. తప్పకుండా తల్లీ ఆలోచిస్తున్నా.. తొందరలో నిర్ణయం తీసుకుంటానంటూ సీఎం సమాధానం చెప్పారు.బాబు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులను తీసుకు ని వచ్చే బాధ్యత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై పెట్టా రు. విభజన తర్వాత రావాల్సిన నిధులు, అభివృద్ధికి నిధులు, హడ్కో నిధులు అన్నీ వెంకయ్య తీసుకుని రావాలన్నారు.
Post Top Ad
Sunday, July 20, 2014
బాబును నిలదీసిన మహిళలు
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment