ఫోన్‌లో జగన్ పరామర్శించారు. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, May 28, 2014

ఫోన్‌లో జగన్ పరామర్శించారు.

jagan call doing said

విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని ప్రసాద్ మనస్థాపం చెంది పైడూరుపాడు గ్రామంలో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నడు. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌ మోహన్‌ రెడ్డి  ఫోన్‌ చేసి పార్టీ అభిమాని మందా ప్రసాద్ కుటుంబసభ్యులను ప్రసాద్ భార్య దీనమ్మ, కుమార్తె భార్గవిలను ఆయన ఫోనులో పరామర్శించారు.ప్రసాద్ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.   పార్టీ అధికారంలోకి రాకపోవడంతో తీవ్రంగా కలత చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసింది.

ప్రసాద్ మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసాద్ మృతి చెందడం బాధాకరమని జగన్ పేర్కొన్నారు. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. తాను జిల్లాకు వచ్చినప్పుడు వ్యక్తిగతం వచ్చి కలుస్తానని చెప్పారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Post Bottom Ad