చిరంజీవిని నిలదీసిన ఎన్నారై ఓటరు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, April 30, 2014

చిరంజీవిని నిలదీసిన ఎన్నారై ఓటరు!

chiranjeevi-questioned-by-nri

కేంద్రమంత్రి చిరంజీవి వాహనంలో జూబ్లీహిల్స్ క్లబ్‌ వచ్చి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండగా.... లైన్ లో రావాలని కార్తీక్ అనే ఎన్నారై ఓటరు నిలదీశారు. తాము దాదాపు గంట నుంచి క్యూలో నిలబడి ఓటు వేసేందుకు వేచి చూస్తున్నామని, ఇలా వచ్చి, అలా ఓటు వేసి వెళ్లిపోతే తామంతా ఏం కావాలని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. దాంతో చిరంజీవి ఒక్కసారిగా అవాక్కయ్యారు. మీడియా దృష్టి మొత్తం తనమీదే పడిందని గుర్తించి, వాళ్లందరినీ శాంతపరిచి, క్యూలో నిలబడ్డారు. కాసేపు వేచి ఉండి, తన వంతు వచ్చిన తర్వాతే ఓటు వేశారు. ఆయనతో పాటు కుమారుడు రామ్ చరణ్, భార్య సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad