2జీ కుంభకోణానికి సంబంధించి నల్లధనం చలామణి కేసులో టెలికం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, మరో 17 మందిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేసింది. డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ పేరును కూడా చార్జ్ షీట్లో పేర్కొంది. మొత్తం పది మంది వ్యక్తులు, ఏడు కంపెనీలపై అభియోగాలు నమోదు చేసింది. చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలో వద్దో ఈ నెల 30న సీబీఐ న్యాయస్థానం న్యాయమూర్తి ఒ.పి.సైనీ నిర్ణయం తీసుకోనున్నారు. స్వాన్ టెలికం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా.. డీఎంకేకు చెందిన కలైంజర్ టీవీకి రూ.200 కోట్లు ముడుపులు చెల్లించినట్లు తమ దర్యాప్తులో వెల్లడయిందని ఈడీ.. చార్జ్ షీట్లో పేర్కొంది.
2జీ కుంభకోణానికి సంబంధించి నల్లధనం చలామణి కేసులో టెలికం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, మరో 17 మందిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేసింది. డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ పేరును కూడా చార్జ్ షీట్లో పేర్కొంది. మొత్తం పది మంది వ్యక్తులు, ఏడు కంపెనీలపై అభియోగాలు నమోదు చేసింది. చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలో వద్దో ఈ నెల 30న సీబీఐ న్యాయస్థానం న్యాయమూర్తి ఒ.పి.సైనీ నిర్ణయం తీసుకోనున్నారు. స్వాన్ టెలికం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా.. డీఎంకేకు చెందిన కలైంజర్ టీవీకి రూ.200 కోట్లు ముడుపులు చెల్లించినట్లు తమ దర్యాప్తులో వెల్లడయిందని ఈడీ.. చార్జ్ షీట్లో పేర్కొంది.
No comments:
Post a Comment