సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ... ప్రధాని మన్మోహన్సింగ్కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఓ అధికార ప్రకటనలో వెల్లడించినట్టు యూఎన్ఐ వార్తాకథనం బుధవారం తెలిపింది. తెలంగాణ బిల్లుకు మంగళవారం లోక్సభలో ఆమోదం తెలిపిన అనంతరం సోనియా ఈ ప్రకటన చేసింది. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే విషయమై బీజేపీతో ఏర్పడిన ప్రతిష్ఠంభన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశగా సోనియా తాజా వినతి చేసినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీజేపీ డిమాండ్లకు కేంద్రం తలొగ్గక తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆ లబ్ధి తాను పొందేందుకు సోనియాగాంధీ సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని ప్రధానిని కోరినట్లు కొత్త డ్రామాకు తెర తీసిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మంగళవారం లోక్సభలో రాష్ట్ర విభజనపై చర్చ జరిగినప్పుడు సోనియాగాంధీ జోక్యం చేసుకొని సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పిస్తామని ఎందుకు చెప్పలేదని వారి నిలదీస్తున్నారు.
Post Top Ad
Thursday, February 20, 2014
సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ!
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment