రాష్ట్ర విభజన నేపథ్యంలో... ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పాలనా పగ్గాలను, శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించడాన్ని మొదట్నుంనీ వ్యతిరేకిస్తున్న ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఈ నిర్ణయం తీసుకుంటే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని వ్యవహారమైనందున ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణ బిల్లును యథాతథంగా అమలు చేస్తే 620 చదరపు కిలోమీటర్ల జీహెచ్ఎంసీ ప్రాంతం మొత్తం గవర్నర్ పరిధిలో ఉంటుంది. ఈ విషయాన్ని ఇంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్ ఆంతర్యమేమిటో ఆయనకే తెలియాలి.
Post Top Ad
Tuesday, February 25, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment