సోనియా- నాట్ ద బిలవ్‌డ్‌ ఆఫ్‌ పీవీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, February 18, 2014

సోనియా- నాట్ ద బిలవ్‌డ్‌ ఆఫ్‌ పీవీ


మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో సోనియాగాంధీకి సత్సంబంధాలు లేవని తాజాగా మరోమారు రుజువైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆహారశాఖ మంత్రి కేవీ థామస్‌ రాసిన ''సోనియా- ద బిలవ్‌డ్‌ ఆఫ్‌ ద మాసెస్‌'' అనే పుస్తకంలో పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో దర్యాప్తు నత్తనడకన సాగడంపై సోనియా అసంతృప్తిగా ఉండటమే దీనికి కారణమని తెలిపింది. ఆగస్టు 20, 1995న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సోనియా ఇచ్చిన ప్రసంగాన్ని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. రాజీవ్‌ హత్య కేసులో అప్పటి ప్రభుత్వాన్ని ఆమె తప్పు పట్టారని వివరించారు. మాజీ ప్రధానమంత్రి హత్య కేసులోనే దర్యాప్తునకు అధిక సమయం తీసుకుంటే న్యాయం కోసం పోరాడే సామాన్య పౌరుడి పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించినట్లు థామస్ రాశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad