మొబైల్ మార్కెట్ రాజ్యమేలిన మొబైల్ ఫోన్ల దిగ్గజం నోకియా ఇప్పుడు పరాధీనమైపోతోంది. ఫోన్ అంటేనే నోకియా అనే స్థాయి నుంచి పోటీ తట్టుకోలేక విలవిల్లాడే స్థాయికి చేరుకుంది. సాఫ్ట్వేర్ రంగ రారాజు మైక్రోసాఫ్ట్.. 720 కోట్ల డాలర్లను(సుమారు రూ. 47,520 కోట్లు) వెచ్చించి నోకియాను సొంతం చేసుకోనుంది. డీల్ తరువాత నోకియా కేవలం నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థగా మిగలనుండగా, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హార్డ్వేర్లోనూ రాణించనుంది. కాగా, నోకియా ఇప్పటికే స్మార్ట్ఫోన్ల విభాగంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ద్వారా మొబైళ్లు, ట్యాబ్లెట్ల వృద్ధిలో ముందున్న ఇండియా మార్కెట్లో మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టంకానుంది.డీల్లో భాగంగా లూమియా, ఆశా బ్రాండ్లతోపాటు, ఫీచర్ ఫోన్లకు నోకియా పేరును పదేళ్లపాటు మైక్రోసాఫ్ట్ వినియోగించుకోనుంది. దీంతోపాటు 8,500 డిజైన్లకు సంబంధించిన పేటెంట్లు, మ్యాపింగ్ సర్వీసుల లెసైన్స్ను కూడా పొందుతుంది.
మొబైల్ మార్కెట్ రాజ్యమేలిన మొబైల్ ఫోన్ల దిగ్గజం నోకియా ఇప్పుడు పరాధీనమైపోతోంది. ఫోన్ అంటేనే నోకియా అనే స్థాయి నుంచి పోటీ తట్టుకోలేక విలవిల్లాడే స్థాయికి చేరుకుంది. సాఫ్ట్వేర్ రంగ రారాజు మైక్రోసాఫ్ట్.. 720 కోట్ల డాలర్లను(సుమారు రూ. 47,520 కోట్లు) వెచ్చించి నోకియాను సొంతం చేసుకోనుంది. డీల్ తరువాత నోకియా కేవలం నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థగా మిగలనుండగా, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హార్డ్వేర్లోనూ రాణించనుంది. కాగా, నోకియా ఇప్పటికే స్మార్ట్ఫోన్ల విభాగంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ద్వారా మొబైళ్లు, ట్యాబ్లెట్ల వృద్ధిలో ముందున్న ఇండియా మార్కెట్లో మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టంకానుంది.డీల్లో భాగంగా లూమియా, ఆశా బ్రాండ్లతోపాటు, ఫీచర్ ఫోన్లకు నోకియా పేరును పదేళ్లపాటు మైక్రోసాఫ్ట్ వినియోగించుకోనుంది. దీంతోపాటు 8,500 డిజైన్లకు సంబంధించిన పేటెంట్లు, మ్యాపింగ్ సర్వీసుల లెసైన్స్ను కూడా పొందుతుంది.
No comments:
Post a Comment