జగన్ బెయిల్‌ను అడ్డుకోవడానికేనా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 13, 2013

జగన్ బెయిల్‌ను అడ్డుకోవడానికేనా!


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆత్మగౌరవ యాత్రను రద్దుచేసుకుని మరీ ఢిల్లీకి వెళుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయమైంది. రాష్ట్ర విభజన అంశాలపై మాట్లాడటానికే తాను ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలుస్తున్నట్లు చంద్రబాబు పైకి చెబుతున్నా... లోపల చేయబోతున్నది మాత్రం జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభంజనంలో తాను, తన పార్టీ కొట్టుకుపోతామనే భయంతోనే చంద్రబాబు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడని వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినపుడల్లా ఏదో ఒక కొత్త నాటకం ఆడి బెయిల్ రాకుండా కోర్టులను ప్రభావితం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందనికూడా వారు అంటున్నారు. గతంలోనూ చిదంబరం వద్దకు తమ్ముళ్ల బృందాన్ని పంపి జగన్ పై ఈడీని ఉసిగొల్పారని కూడా చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad