పార్లమెంటరీ బోర్డు భేటీకి అద్వానీ ఆబ్సెంట్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 15, 2013

పార్లమెంటరీ బోర్డు భేటీకి అద్వానీ ఆబ్సెంట్

బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీకి అద్వానీని రప్పించేందుకు సీనియర్ నేతలు చివరి నిమిషం వరకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  పన్నెండు మంది సభ్యులు గల పార్లమెంటరీ బోర్డు సమావేశానికి అద్వానీ రాలేదు. మోడీపై కినుక వహించిన అద్వానీ మినహా మిగిలిన నేతలందరూ హాజరయ్యారు. సుష్మా స్వరాజ్, మురళీమనోహర్ జోషీ, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ తదితర సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు చాలాకాలం నుంచే రంగం సిద్ధమైనా, కొద్దిరోజులుగా ఇందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad