దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నిందితుడు దొరికాడు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, August 31, 2013

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల నిందితుడు దొరికాడు!

హైదరాబాద్లోని దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనేత అయిన యాసిన్‌ కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనిపై రూ.35 లక్షల రివార్డు కూడా ఉంది. ఇతనితో పాటు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad