తెలంగాణ ప్రజలను అభివృద్ధి చెందనివ్వలేదు: జీవన్ రెడ్డి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, August 21, 2013

తెలంగాణ ప్రజలను అభివృద్ధి చెందనివ్వలేదు: జీవన్ రెడ్డి


రాష్ట్రంలో 60 ఏళ్లలో సీమాంధ్ర నాయకులే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు కొనుక్కుని అభివృద్ధి చెందారే తప్ప తెలంగాణ ప్రజలను మాత్రం అభివృద్ధి చెందనివ్వలేదని  మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. సీమాంధ్ర పాలకుల వల్ల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు వాణిజ్యపరంగా మాత్రమే అభివృద్ధి చెందాయన్నారు. దానివల్ల అక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.  కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామ సమీపంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad