తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చైతన్య రథయాత్ర నిర్వహించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన హరికృష్ణ నగరానికి వచ్చిన తర్వాత సన్నిహితులతో చర్చించి యాత్ర షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం. ఈ నెలాఖరు నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేయనున్న తెలుగు ఆత్మగౌరవయాత్ర కంటే ముందుగానే హరికృష్ణ తన యాత్రను ప్రారంభించి తొలుత రాయలసీమ, తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. కొద్ది విరామం అనంతరం మిగిలిన జిల్లాల్లో యాత్ర చేస్తారని సమాచారం.
తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చైతన్య రథయాత్ర నిర్వహించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన హరికృష్ణ నగరానికి వచ్చిన తర్వాత సన్నిహితులతో చర్చించి యాత్ర షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం. ఈ నెలాఖరు నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేయనున్న తెలుగు ఆత్మగౌరవయాత్ర కంటే ముందుగానే హరికృష్ణ తన యాత్రను ప్రారంభించి తొలుత రాయలసీమ, తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. కొద్ది విరామం అనంతరం మిగిలిన జిల్లాల్లో యాత్ర చేస్తారని సమాచారం.
No comments:
Post a Comment