అల్లరి నరేష్ కథానాయకునిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కెవ్వు కేక’. షర్మిల మాండ్రే కథానాయిక. దేవిప్రసాద్ దర్శకుడు. బొప్పన చంద్రశేఖర్ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోందీ సినిమా. నిర్మాత మాట్లాడుతూ- ‘‘బ్లేడ్బాబ్జీ తర్వాత నరేష్, దేవిప్రసాద్ కాంబినేషన్లో వస్తున్న పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. ఇటీవలే పొల్లాచ్చి, బ్యాంకాక్లలో ఓ షెడ్యూల్ చేశాం.
ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న చివరి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. మేలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్టైనర్ ఇదని, తప్పకుండా ఈ వేసవికి వినోదాన్ని పంచే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు.
ఆశిష్ విద్యార్థి, అపూర్వ, నిషా, గీతాసింగ్, కిరణ్రాథోడ్, సన తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వేగేశ్న సతీష్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, కెమెరా: ఎ.విజయ్కుమార్, సమర్పణ: నీలిమ.
No comments:
Post a Comment