కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అసంతృప్తిగా ఉండగా, తాజాగా ఆ జాబితాలోకి గద్దె రాంమ్మెహన్ కూడా చేరారు.
విజయవాడ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కేసినేని నాని నియామకం పట్ల గద్దె రాంమ్మోహన్ అసంతృప్తిగా ఉన్నారు.
గన్నవరం లేదా విజయవాడ నుంచి తనకు ఎంపీ టిక్కెట్ కేటాయిస్తారనుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఎవరినీ సంప్రదించకుండా కేశినేని నానిని ఎలా నియమిస్తారని
గద్దె శనివారమిక్కడ ప్రశ్నించారు. మీకోసం వస్తున్న పాదయాత్ర తర్వాత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలవనున్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment