తరచూ సింగపూర్ జపం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడి లీక్వాన్ యూనివర్సిటీలో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను సింగపూర్ తో పోల్చారు. తమ హయాంలో ఏపీలో ఆటోమొబైల్ రంగం, మొబైల్ ఫోన్ల తయారీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. సింగపూర్ తరహా ఇళ్లను రాష్ట్రంలోనూ కట్టాలని అధికారులకు సూచించారు. సీఎం సారథ్యంలో సింగపూర్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణతోపాటు మరో 26 మంది భవన నిర్మాణ ప్రతినిధులు సోమవారం అక్కడ నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలను సందర్శించి వాటిల్లో ఆధునిక సాంకేతికతను పరిశీలించారు. అంతేకాక, సింగపూర్లోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అథారిటీ అధికారులతో సమావేశమయ్యారు.
తరచూ సింగపూర్ జపం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడి లీక్వాన్ యూనివర్సిటీలో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను సింగపూర్ తో పోల్చారు. తమ హయాంలో ఏపీలో ఆటోమొబైల్ రంగం, మొబైల్ ఫోన్ల తయారీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. సింగపూర్ తరహా ఇళ్లను రాష్ట్రంలోనూ కట్టాలని అధికారులకు సూచించారు. సీఎం సారథ్యంలో సింగపూర్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణతోపాటు మరో 26 మంది భవన నిర్మాణ ప్రతినిధులు సోమవారం అక్కడ నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలను సందర్శించి వాటిల్లో ఆధునిక సాంకేతికతను పరిశీలించారు. అంతేకాక, సింగపూర్లోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అథారిటీ అధికారులతో సమావేశమయ్యారు.
No comments:
Post a Comment