ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తాము నమ్మలేమని సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఒకవైపు పోరాటం అంటూనే, మరో వైపు ఆంక్షలు పెడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేసే వారి మాయలో పడొద్దని అసెంబ్లీలో సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జపాన్ తరహాలో ఉద్యమించాలని చంద్రబాబు చెబుతున్నారని, జపాన్లో అవినీతికి పాల్పడితే ఉరితీస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ దేశంలో అవినీతికి పాల్పడిన మంత్రులను జైల్లో పెట్టారు.. ఇక్కడ పెడతారా? అని ప్రశ్నించారు. ఏప్రిల్ 1న విద్యార్థి జేఏసీ చేపట్టిన ఆందోళనకు మద్దతిస్తామని తెలిపారు. అలాగే ఏప్రిల్ 5న రాత్రి 7గంటల నుంచి 7 30 గంటల వరకు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్డేగా పాటిస్తామన్నారు.
Post Top Ad
Friday, March 30, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment