టీడీపీతో సమరానికి సీమ బీజేపీ సిద్ధమా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, February 24, 2018

టీడీపీతో సమరానికి సీమ బీజేపీ సిద్ధమా?

tdp-vs-rayalaseema-bjp-leaders
టీడీపీతో సమరానికి రాయలసీమ బీజేపీ నేతలు కొత్త డిమాండ్లతో సిద్ధమయ్యారు. కర్నూలులో జరిగిన సమావేశంలో సీమకు సంబంధించి డిక్లరేషన్ విడుదల చేశారు. రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు జిల్లాలను ఎనిమిదికి పెంచాలని ఈ డిక్లరేషన్‌లో సూచించారు. అలాగే రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటుగా రూ. 10వేల కోట్లు కేటాయించాలని కోరారు. రాయలసీమలో ఆరునెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నడపాలని కూడా కోరారు. వచ్చే బడ్జెట్‌లో రాయలసీమకు రూ. 20వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. 2019కల్లా గాలేరు-నగరి, హంద్రీనీవా, గురు రాఘవేంద్రస్వామి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సాధనకు కడపలో సమావేశం జరపాలని నిర్ణయించారు. బిజెపిపై టిడిపి విమర్శలు చేస్తున్న నేపద్యంలో బిజెపి నేతలు ఈ డిమాం
డ్లతో ముందుకు వచ్చారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad