పోలవరం ప్రాజెక్టు నిధుల అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ చేయడానికి ప్రధాని మోడీ ప్రాతిపదిక తయారు చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా మోడీ తెప్పించుకుంటున్నారని, ఆయన సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ముడుపులు, టీడీపీ నేతలకు ఎలా దక్కాయన్నదానిపై ఆరా తీస్తున్నారని ఆయన అన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని అన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఆత్మగౌరవ సదస్సులో ఆయన ఈ విషయాలు చెప్పారు.
Post Top Ad
Saturday, February 24, 2018
పోలవరంపై సీబీఐ విచారణకు మోడీ సిద్ధమా!
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment