సోషల్ మీడియా అప్లికేషన్ వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్తో ముందుకు దూసుకెళ్తుంది. రెండు మూడేళ్ల క్రితం కేవలం మెసేజ్లు మాత్రమే పంపడానికి వీలుండే దీనిలో ఆడియో, వీడియో కాలింగ్ ఆప్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రైవసీకి సంబంధించి ఎన్నో ఆప్షన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది వాట్సాప్. ఇప్పుడు కూడా మరో కొత్త ఫీచర్తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు మనం పంపిన మెసేజ్ అవతలివారికి డెలివరీ అయ్యిందో లేదే, వారు చదివారో లేదో తెలుసుకునే అవకాశం ఉండేది. డబుల్ టిక్కులు, బ్లూ టిక్కుల రూపంలో ఈ సౌకర్యాన్ని వాట్సాప్ అందించింది. అయితే ఎవరికైనా పొరపాటున వేరే మెసేజ్ పంపినప్పుడు దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ను వాట్సాప్ తాజాగా అందిస్తోంది. తప్పుగా పంపిన సందేశాలను అవతలి వ్యక్తికి కనిపించకుండా డిలీట్ చేసే సదుపాయాన్ని వాట్సాప్ మంగళవారం అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానంలో మనం ఏదైనా మెసేజ్ను సెలక్ట్ చేసుకుని డిలీట్ బటన్ నొక్కగానే ‘డిలీట్ ఫర్ మి’, ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మొదటి ఆప్షన్ను ఎంచుకుంటే సందేశం మన ఫోన్లో మ్రాతమే డిలీట్ అవుతుంది. రెండో ఆప్షన్ను ఎంచుకుంటే మెసేజ్ ఎవరికి పంపామో వారికి కూడా కనిపించకుండా పోతుంది. అయితే అవతలి వ్యక్తి ఫోన్లో ఆ సందేశం స్థానంలో ‘దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్’ అని చూపిస్తుంది. అంటే మనం మెసేజ్ పంపి, ఆ తర్వాత డిలీట్ చేశామని ఆ వ్యక్తికి స్పష్టంగా తెలిసిపోతుంది. సందేశం పంపిన ఏడు నిమిషాల్లోపు మాత్రమే డిలీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. వాట్సాప్ యాప్ను అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ సౌకర్యాన్ని వినయోగించుకోవచ్చు.
No comments:
Post a Comment