సుమారు 70ఏళ్ల క్రితం నాటి మహాత్మా గాంధీ హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ అభినవ్ భారత్ సంస్థ ట్రస్టీ పంకజ్ ఫ
డ్నవిస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఈ కేసుపై అక్టోబర్ 6న విచారించి, కేసులో అనేక అంశాలున్నందున సాయం చేయాలని మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్ను కోరింది. అయితే ఈ కేసులో పంకజ్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ గాంధీ మనవడు తుషార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇలా పిటిషన్ దాఖలు చేయడానికి ఆయనకున్న అర్హతను జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎం.ఎం.శాంతనుగౌడర్ల ధర్మాసనం ప్రశ్నించింది. ఇదిలాఉండగా ఈ కేసులో కోర్టు సహాయకుడిగా ఉన్న అమరేందర్ శరణ్ తన నివేదిక అందించేందుకు నాలుగు వారాల గడువు కోరారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
డ్నవిస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఈ కేసుపై అక్టోబర్ 6న విచారించి, కేసులో అనేక అంశాలున్నందున సాయం చేయాలని మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్ను కోరింది. అయితే ఈ కేసులో పంకజ్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ గాంధీ మనవడు తుషార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇలా పిటిషన్ దాఖలు చేయడానికి ఆయనకున్న అర్హతను జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎం.ఎం.శాంతనుగౌడర్ల ధర్మాసనం ప్రశ్నించింది. ఇదిలాఉండగా ఈ కేసులో కోర్టు సహాయకుడిగా ఉన్న అమరేందర్ శరణ్ తన నివేదిక అందించేందుకు నాలుగు వారాల గడువు కోరారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
No comments:
Post a Comment