గాంధీ హత్య కేసులో మనవడి అభ్యంతరం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

గాంధీ హత్య కేసులో మనవడి అభ్యంతరం!

tushar-gandhi-pitition-sc-opposing-reopening-gandhi-caseసుమారు 70ఏళ్ల క్రితం నాటి మహాత్మా గాంధీ హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించాలని కోరుతూ అభినవ్‌ భారత్‌ సంస్థ ట్రస్టీ పంకజ్‌ ఫ
డ్నవిస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఈ కేసుపై అక్టోబర్‌ 6న విచారించి, కేసులో అనేక అంశాలున్నందున సాయం చేయాలని మాజీ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అమరేందర్‌ శరణ్‌ను కోరింది. అయితే ఈ కేసులో పంకజ్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ గాంధీ మనవడు తుషార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.  ఇలా పిటిషన్‌ దాఖలు చేయడానికి ఆయనకున్న అర్హతను జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ ఎం.ఎం.శాంతనుగౌడర్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. ఇదిలాఉండగా ఈ కేసులో కోర్టు సహాయకుడిగా ఉన్న అమరేందర్‌ శరణ్‌ తన నివేదిక అందించేందుకు నాలుగు వారాల గడువు కోరారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad