2012లో అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముంబై భామ లావణ్య త్రిపాఠీకి కోలీవుడ్ నిర్మాతల సంఘం మూడు కోట్ల రూపాయల జరిమానా విధించిందని తమిళ చిత్ర వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలుగులో నాగచైతన్య, తమన్నా నటించి, మంచి హిట్టయిన 100% లవ్ సినిమాను తమిళంలో 100% కాదల్గా రీమేక్ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు కథానాయకిగా లావణ్య త్రిపాఠీని మొదట ఎంచుకున్నారు. కానీ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే లావణ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో చిత్రీకరణను నిలిపివేశారు. అప్పటికే నిర్మాతలకు మూడు కోట్ల రుపాయల నష్టం వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలు.. సంఘాన్ని ఆశ్రయించడంతో ఈ ఫైన్ విధించారని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే 100% కాదల్ సినిమాకు తాజాగా ఈ చిత్ర కథానాయకిగా అర్జున్రెడ్డి ఫేం షాలిని పాండేను ఎంపిక చేశారు. కథానాయకుడిగా జి.వి. ప్రకాశ్ నటిస్తున్నారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment