రెండో రోజు రాజమండ్రి పుష్కరాల్లో పోటెత్తిన భక్తులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 15, 2015

రెండో రోజు రాజమండ్రి పుష్కరాల్లో పోటెత్తిన భక్తులు

గోదావరి మహాపుష్కరాలు సందర్భంగా రెండో రోజు రాజమండ్రి పుష్కర ఘాట్లలో భక్తులు వేలాదిగా పోటెత్తారు. దీంతో మొదటి రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో 25 మంది చనిపోయిన సందర్భంగా రెండో రోజు అలాంటి ఘటనలకు తావివ్వకుండా సీఎం నుంచి మంత్రులు.. పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ పుష్కర ఘాట్ల బందోబస్తు చర్యల పర్యవేక్షణలో మునిగి తేలారు. దీంతో భక్తులు ఎలాంటి సౌకర్యాలకు గురికాకుండా ప్రశాంతంగా పుష్కర స్నానాలు ఆచరించారు. కేంద్రం మంత్రి సుజనా చౌదరి దంపతులు, రాజమండ్రి
ఎంపీ మురళీమోహన్, స్వరూపానంద స్వాములు బుధవారం ఉదయం పుష్కర స్నానాలు ఆచరించారు. దీంతో బుధవారం అమావాస్య కావడంతో భక్తుల సంఖ్యకు పెరుగుతోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad