నవ్యాంధ్రపై కేంద్రం దోబూచులాట! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, April 25, 2015

నవ్యాంధ్రపై కేంద్రం దోబూచులాట!

తెలంగాణ నుంచి విడిపోయిన నవ్యాంధ్ర రాష్ర్ట ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. నవ్యాంధ్ర నిర్మాణానికి సహకరించాల్సింది పోయి.. ఓ రోజు ప్రత్యేక హోదా ఇస్తామంటూనే.. మళ్లి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తోంది. దీన్ని ప్రతిపక్షాలు విమర్శిస్థుంటే.. విభజన బిల్లులో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వమని అప్పట్లో విభజించిన ప్రభుత్వం బిల్లులు ఈ అంశాన్ని పొందుపరచలేదని, అయినా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామనడం.. కాదు కాదు.. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులిస్తామని చెబుతోంది. ప్రత్యేక హోదా ఇస్తే.. మిగతా రాష్ర్టాలు ఇదే డిమాండ్ తో ఉన్నాయని చెప్పడం చూస్తోంటే.. ఓ రోజు ప్రత్యేక హోదా ఇస్తామనడం.. ఓ రోజు లేదనడం.. చూస్తోంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర  ప్రభుత్వం దోబూచులాడుతోందని చెప్పవచ్చు. ఎన్డీయే కూటమిలో తెదేపా ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా సాధించలేకపోతోందని.. విపక్షాలు.. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఆంధ్రా సీఎం చంద్రబాబు పరిస్థితి ఆందోళన కరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad