జయలలితకు శిక్ష వేసింది ఆయనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 28, 2014

జయలలితకు శిక్ష వేసింది ఆయనా?

john-michela-denuha-jaylalalitha-case
జాన్ మైఖేల్ డికున్హా నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు పుణ్యమాని ఒక్కసారిగా ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆయన ఎవరో కాదు.. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి ఆయనే. బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు మొదట బాలకృష్ణన్ న్యాయమూర్తిగా ఉండేవారు. అయితే ఆయన కేసు విచారణ పూర్తి కాకముందే పదవీ విరమణ చేశారు. దాంతో ఆ తర్వాత ఆ కోర్టుకు న్యాయమూర్తిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు విచారణ పూర్తయింది. ఈ కేసులో తీర్పును జయలలిత ముందే ఊహించారో ఏమో గానీ, శనివారం నాడు తీర్పు వెల్లడించకుండా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా సుప్రీం మాత్రం అందుకు నిరాకరించింది. దాంతో శనివారం నాడే జయలలితను దోషిగా నిర్ధరిస్తూ న్యాయమూర్తి జాన్ మైఖేల్ తీర్పు చెప్పారు.

No comments:

Post a Comment

Post Bottom Ad