బెంగళూరు: ఉదయం వరకు ముఖ్యమంత్రిగా అధికార దర్పం అనుభవించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతంగా ఖైదీగా జైలు జీవితం గడుపుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలితను బెంగలూరులోని పరపణ అగ్రహార జైలుకు తరలించారు. జయలలితకు ఖైదీ నెంబర్ 7402 కేటాయించారు. జయకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇదే కోసులే జయలలిత స్నేహితురాలు శశికళ, సుధాకరన్ కు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్షతో పాటు పది కోట్ల రూపాయల జరిమానా విధించింది. వీరిని కూడా జైలుకు తరలించారు. శశికళకు 7403, సుధాకరణన్ కు 7404, ఇళవరసుకు 7405 నెంబర్లను కేటాయించారు.
Post Top Ad
Saturday, September 27, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment