అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష పడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. జయకు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాదులు కర్నాటక హై కోర్టుకు ఎక్కే యోచనలో ఉన్నారు. ఈ శిక్ష పై స్టే ఇవ్వాలని, తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు వీలు కల్పించాలని కోరుతూ వారు పిటిషన్ వేయనున్నారు. ఈ విషయంలో న్యాయపరమైన అంశాలపై జయలలిత న్యాయనిపుణులతో చర్చించారు. బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది. మూడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడితే హైకోర్టే బెయిల్ ఇవ్వాలని జయ తరపు న్యాయవాది ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం హైకోర్టు వెకేషన్ లో ఉన్నప్పటికీ సోమవారం ప్రత్యేక బెంచ్ ఎదుట వారు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది.
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష పడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. జయకు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఆమె తరఫు న్యాయవాదులు కర్నాటక హై కోర్టుకు ఎక్కే యోచనలో ఉన్నారు. ఈ శిక్ష పై స్టే ఇవ్వాలని, తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు వీలు కల్పించాలని కోరుతూ వారు పిటిషన్ వేయనున్నారు. ఈ విషయంలో న్యాయపరమైన అంశాలపై జయలలిత న్యాయనిపుణులతో చర్చించారు. బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది. మూడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడితే హైకోర్టే బెయిల్ ఇవ్వాలని జయ తరపు న్యాయవాది ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం హైకోర్టు వెకేషన్ లో ఉన్నప్పటికీ సోమవారం ప్రత్యేక బెంచ్ ఎదుట వారు తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది.
No comments:
Post a Comment