తన పేరు మీద వస్తున్న సర్వే ఫలితాలు అవాస్తవని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తన పేరు మీద కొన్ని ఎస్.ఎమ్.ఎస్.లు వ్యాప్తిలోకి వస్తున్నాయని, తాను ఎలాంటి సర్వేలపై ఎవరికి సమాచారం ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు. అయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో కి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సీమాంద్రలో డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరగవచ్చని, సీమాంద్రలో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తుందని తన ప్రాధమిక అంచనా అని ఆయన తెలిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై ఈ నెల పన్నెండో తేదీన ఒక అభిప్రాయం రావచ్చని చెప్పారు. కేంద్రంలో ఎన్.డి.ఎ అధికారంలోకి వస్తుందని లగడపాటి తెలిపారు.
Post Top Ad
Sunday, May 04, 2014
సర్వే ఫలితాలు అవాస్తవం: లగడపాటి
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment