సినీ నటుడు, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో సీతారామరాజు సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబును గజినీ అంటూ విమర్శించారు. ఇచ్చిన మాటలు, హామీలను గజిని లాగే మర్చిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గజినీ అయితే చిరంజీవి రాజకీయ అజ్ఞాని అంటూ చంద్రబాబు అభిమానులు ప్రతిదాడికి దిగుతున్నారు. మొన్నీమధ్య కర్నాటకలో ప్రచారానికి వెళ్లి అభాసుపాలైన చిరంజీవి ఇప్పుడు చంద్రబాబును విమర్శించే అర్హతలేదంటున్నారు. కూడంకులం ప్రాజెక్టును తాగు, సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొన్న చిరంజీవికి మతిలేదంటూ ఎదురుదాడి చేస్తున్నారు.
సినీ నటుడు, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో సీతారామరాజు సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబును గజినీ అంటూ విమర్శించారు. ఇచ్చిన మాటలు, హామీలను గజిని లాగే మర్చిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గజినీ అయితే చిరంజీవి రాజకీయ అజ్ఞాని అంటూ చంద్రబాబు అభిమానులు ప్రతిదాడికి దిగుతున్నారు. మొన్నీమధ్య కర్నాటకలో ప్రచారానికి వెళ్లి అభాసుపాలైన చిరంజీవి ఇప్పుడు చంద్రబాబును విమర్శించే అర్హతలేదంటున్నారు. కూడంకులం ప్రాజెక్టును తాగు, సాగునీటి ప్రాజెక్టు అని పేర్కొన్న చిరంజీవికి మతిలేదంటూ ఎదురుదాడి చేస్తున్నారు.
No comments:
Post a Comment