సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్... సీబీఐ. ఈ పేరు తెలియని వారుండరు. క్లిష్టమైన కేసులతోపాటు పెద్ద కేసుల్లో ఇరుకున్న పెద్ద మనుషులపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సీబీఐ పాత్ర పెరిగినట్లుగా కనిసిస్తుంది. రాజకీయ నాయకులు తమకు గిట్టని వారిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోర్టులను ఆశ్రయిస్తుండడం, కోర్టులు అందుకనుగుణంగా ఆదేశిస్తుండడం, ప్రభుత్వాధినేతలు కూడా సీబీఐని తమకు గిట్టనివారిపై ఉసి గొల్పుతుండడం జరుగుతుంది. అయితే తాజాగా రాష్ట్ర హైకోర్టు సీబీఐని ఏకిపారేసింది. దానికి అంత సీన్ లేదంటూ పరోక్షంగా చెప్పింది. అది కేవలం ఓ డిటెక్టివ్ ఏజెన్సీలాంటిదేనని తేల్చేసింది. సీబీఐ ఛేదించలేని ఎన్నో కేసుల్ని స్థానిక పోలీసులు ఛేదించారని ఉద్ఘాటించింది. సీబీఐ ఫోబియా పట్టుకుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి చెందిన కెనెటా పవర్కు భూ కేటాయింపులపై సీబీఐ, ఈడీల చేత దర్యాప్తు జరిపించాలంటూ న్యాయవాది ఎం.వి.వి.ఎస్.ప్రసాద్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించింది. స్థానిక పోలీసుల గొప్పదనాన్ని వివరిస్తూ ఓ ఉదాహరణను కూడా కోర్టు ప్రస్తావించింది. "కోల్కతాలో ఓ బాలిక తప్పిపోయిన కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు ఆ బాలిక ఆచూకీ కనుక్కోలేకపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్లోని ఓ ఎస్సై విజయవంతంగా ఆ కేసును ఛేదించి బాలిక ఆచూకీ కనుక్కున్నారు" దీన్ని బట్టి సీబీఐ పనితీరు ఎలాంటిదో తెలుసుకోండంటూ చురకలేసింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్... సీబీఐ. ఈ పేరు తెలియని వారుండరు. క్లిష్టమైన కేసులతోపాటు పెద్ద కేసుల్లో ఇరుకున్న పెద్ద మనుషులపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సీబీఐ పాత్ర పెరిగినట్లుగా కనిసిస్తుంది. రాజకీయ నాయకులు తమకు గిట్టని వారిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోర్టులను ఆశ్రయిస్తుండడం, కోర్టులు అందుకనుగుణంగా ఆదేశిస్తుండడం, ప్రభుత్వాధినేతలు కూడా సీబీఐని తమకు గిట్టనివారిపై ఉసి గొల్పుతుండడం జరుగుతుంది. అయితే తాజాగా రాష్ట్ర హైకోర్టు సీబీఐని ఏకిపారేసింది. దానికి అంత సీన్ లేదంటూ పరోక్షంగా చెప్పింది. అది కేవలం ఓ డిటెక్టివ్ ఏజెన్సీలాంటిదేనని తేల్చేసింది. సీబీఐ ఛేదించలేని ఎన్నో కేసుల్ని స్థానిక పోలీసులు ఛేదించారని ఉద్ఘాటించింది. సీబీఐ ఫోబియా పట్టుకుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి చెందిన కెనెటా పవర్కు భూ కేటాయింపులపై సీబీఐ, ఈడీల చేత దర్యాప్తు జరిపించాలంటూ న్యాయవాది ఎం.వి.వి.ఎస్.ప్రసాద్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్కుమార్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించింది. స్థానిక పోలీసుల గొప్పదనాన్ని వివరిస్తూ ఓ ఉదాహరణను కూడా కోర్టు ప్రస్తావించింది. "కోల్కతాలో ఓ బాలిక తప్పిపోయిన కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ అధికారులు ఆ బాలిక ఆచూకీ కనుక్కోలేకపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్లోని ఓ ఎస్సై విజయవంతంగా ఆ కేసును ఛేదించి బాలిక ఆచూకీ కనుక్కున్నారు" దీన్ని బట్టి సీబీఐ పనితీరు ఎలాంటిదో తెలుసుకోండంటూ చురకలేసింది.
No comments:
Post a Comment