జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రాజు రవితేజ్ తో కలిసి రాసిన 'ఇజం' పుస్తకమే పార్టీ మేనిఫెస్టో అని పవన్ పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని వేదికపైనే పవన్ ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జనసేన బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రజలకు సంపూర్ణ క్రాంతి అందించడమే జనసేన అజెండా అని చెప్పారు. పార్టీ గుర్తు నక్షత్రంలో 6 కోణాలుంటాయని, ఒక్కో కోణం ఒక్కో సిద్ధాంతానికి నిదర్శనమని తెలిపారు.
No comments:
Post a Comment